హైద‌రాబాద్ వ‌స్తున్న విమానం క‌రాచీలో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్

ఇక తాజా ఘ‌ట‌న‌పై ఇండిగో ఎయిర్ లైన్స్ వివ‌ర‌ణ ఇచ్చింది. విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతోనే పైల‌ట్ విమానాన్ని క‌రాచీలో

Update: 2022-07-17 06:51 GMT

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ బ‌య‌లుదేరిన ఇండిగో విమానం పాకిస్థాన్ లోని క‌రాచీ లో ల్యాండ్ అయింది. ప్ర‌యాణికుల‌తో షార్జా నుంచి వ‌స్తున్న ఈ విమానంలో ఉన్న‌ట్టుండి సాంకేతిక లోపం త‌లెత్తింది. ప్ర‌యాణికుల భ‌ద్ర‌త దృష్ట్యా పైల‌ట్ ఆ విమానాన్ని క‌రాచీ వైపు మళ్లించాడు. ఆపై క‌రాచీ ఎయిర్ పోర్టులో విమానాన్ని సుర‌క్షితంగా ల్యాండ్ చేశాడు. టెక్నికల్ లోపాన్ని ముందే గుర్తించిన పైలెట్. విమానాన్ని సమీపంలోని కరాచీకి మళ్లించి దించాల్సి వచ్చింది. ఈ మేరకు ఎయిర్​లైన్స్​ ప్రకటనలో విడుదల చేసింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం లేదని.. ఇండిగో తెలిపింది. ప్యాసింజర్స్ ను హైదరాబాద్​ రప్పించేందుకు మరో విమానాన్ని పంపినట్టుగా తెలిపింది. భారత ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం కరాచీలో ల్యాండ్​ అవడం 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి.ఢిల్లీ నుంచి దుబాయ్​ వెళ్తున్న స్పైస్​జెట్​ విమానాన్ని కూడా జులై 5న పాక్​లోని కరాచీకి మళ్లించారు. ఫ్యూయల్​ ఇండికేటర్​ సరిగా పనిచేయలేదని ల్యాండ్ చేశారు. అప్పటి ఎస్​జీ-11 విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు ఉన్నారు. స్పైస్​జెట్​ విమానంలోని ప్రయాణికులు కరాచీ నుంచి దుబాయి వెళ్లేందుకు వీలుగా మరో ఫ్లైట్​ను భారత్​ నుంచి పంపించారు. ఈ ఘటన గురించి డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ దర్యాప్తునకు ఆదేశించింది.

ఇక తాజా ఘ‌ట‌న‌పై ఇండిగో ఎయిర్ లైన్స్ వివ‌ర‌ణ ఇచ్చింది. విమానంలో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్త‌డంతోనే పైల‌ట్ విమానాన్ని క‌రాచీలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడ‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది. క‌రాచీలో దిగిన ప్ర‌యాణికుల కోసం మ‌రో విమానాన్ని పంపుతున్న‌ట్లు ఇండిగో వెల్ల‌డించింది.


Tags:    

Similar News