బెంగళూరులో ఐటీ సోదాలు.. ఆ రెండు రాష్ట్రాలకు డబ్బులు?

బెంగళూరులో పెద్దయెత్తున ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి

Update: 2023-10-12 05:58 GMT

బెంగళూరులో పెద్దయెత్తున ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. దాదాపు ఇరవై చోట్ల ఈ తనిఖీలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన అధికారులు పెద్దయెత్తున తనిఖీలు చేస్తుండటంతో బెంగళూరు పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతల్లో కలవరం మొదలయింది. ఉదయం నుంచే ఈ సోదాలు మొదలయ్యాయి.

ఎన్నికలకు....
రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు బెంగళూరు నుంచే పెద్దమొత్తంలో నగదును కాంగ్రెస్ పార్టీ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని వచ్చిన సమాచారంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని తెలిసింది. వంద మందికి పైగా అధికారులు ఇరవై బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహిస్తుండటం విశేషం.


Tags:    

Similar News