కాంగ్రెస్ కు బిగ్ షాక్.. 12 మంది ఎమ్మెల్యేలు జంప్

మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు.

Update: 2021-11-25 04:29 GMT

మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా నేతృత్వంలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు తృణమూల్ కాంగ్రెస్ లో చేరిపోయారు. మేఘాలయలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలిచింది. వీరిలో ఇప్పుడు 12 మంది రాజీనామా చేయడంతో మేఘాలయలో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా మారింది.

ఈసారి ఎన్నికల్లోనూ...
మేఘాలయలో మొత్తం 60 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకపోవడంతో ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఇప్పుడు ముఖ్యనేతలంతా టీఎంసీలో చేరడంతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు కష్టాలు తప్పేట్లు లేవు. మేఘాలయ అసెంబ్లీకి 2023లో ఎన్నికలు జరగనున్నాయి.


Tags:    

Similar News