Breaking : ప్రియాంకకు ఈడీ షాక్

ప్రియాంక వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. హర్యానాలో జరిగిన భూకుంభకోణం కేసులో ప్రియాంక చేర్చింది.

Update: 2023-12-28 05:39 GMT

priyanka vadra

ప్రియాంక వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. హర్యానాలో జరిగిన భూకుంభకోణం కేసులో ప్రియాంక పేరును ఈడీ చేర్చింది. ఛార్జిషీటులో ప్రియాంక పేరును నమోదు చేయడం సంచలనంగా మారింది. 2006, 2010లో భూమిని హర్యానాలో కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెబుతోంది.

ఐదు ఎకరాల భూమిని...
హర్యానాలో ఐదు ఎకరాల భూమి కొనుగోలు విషయంలో ప్రియాంక వాద్రా పాత్ర కీలకంగా ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ లో పేర్కొంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక వాద్రాను తొలిసారి ఈడీ ఒక భూకుంభకోణం కేసులో ప్రమేయం ఉన్నట్లు తేల్చింది. ఛార్జిషీటులో ఆమె పేరును చేర్చడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఇది కక్ష సాధింపు చర్యేనంటూ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.


Tags:    

Similar News