ఘోర ప్రమాదాన్ని తప్పించిన వృద్ధ దంపతులు

ఓ వృద్ధ జంట వందలాది మంది ప్రాణాలను కాపాడింది. తమిళనాడులోని తేన్‌కాశీ జిల్లా భగవతీపురం రైల్వే స్టేషన్‌

Update: 2024-02-26 06:21 GMT

ఓ వృద్ధ జంట వందలాది మంది ప్రాణాలను కాపాడింది. తమిళనాడులోని తేన్‌కాశీ జిల్లా భగవతీపురం రైల్వే స్టేషన్‌ వద్ద వృద్ధ దంపతులు రైలును ఆపి ప్రజల ప్రాణాలను కాపాడారు. కేరళ నుంచి ప్లై‌వుడ్ లోడుతో కుంభకోణం వెళ్తున్న ఓ ట్రక్ అర్ధరాత్రివేళ ట్రాక్ దాటుతూ సరిగ్గా ట్రాక్ మధ్యలో బోల్తాపడింది. ట్రక్ బోల్తా పడినప్పుడు పెద్ద శబ్దం రావడంతో సమీపంలో నివసించే వృద్ధ దంపతులు షణ్ముగయ్య- కురుంథమ్మాళ్ టార్చిలైటుతో అక్కడికి చేరుకున్నారు. కాసేపటికి అదే ట్రాక్‌పై నుంచి రైలు వస్తుండడంతో దంపతులు అప్రమత్తమయ్యారు. ట్రాక్‌పై నిల్చుని చేతిలోని టార్చ్ లైటు ఊపుతూ లోకోపైలట్‌కు సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అప్రమత్తమైన లోకోపైలట్ బ్రేకులు వేయడంతో రైలు సరిగ్గా ప్రమాద స్థలానికి వచ్చి రైలు ఆగింది. స్థానికులు, అధికారుల సాయంతో ట్రక్‌ను తొలగించి ట్రాక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటన కారణంగా చెన్నై ఎగ్మోర్-కొల్లాం ఎక్స్‌ప్రెస్ రైలు రెండు గంటలకుపైగా ఆలస్యమైంది. పెను ప్రమాదాన్ని తప్పించిన షణ్ముగయ్య- కురుంథమ్మాళ్ దంపతులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


Tags:    

Similar News