బ్రేకింగ్ : జమ్మూ కాశ్మీర్ లో భూ ప్రకంపనలు

జమ్మూ కాశ్మీర్ లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 5.9 గా భూకంప తీవ్రత నమోదయింది.

Update: 2022-02-05 04:43 GMT

జమ్మూ కాశ్మీర్ లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్ పై 5.7 గా భూకంప తీవ్రత నమోదయింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి భయపడి వీధుల్లోకి పరుగులు తీశారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయకంపితులయ్యారు.

రిక్టర్ స్కేల్ పై....
అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి కంపిచండంతో ప్రజలు భయకంపితులయ్యారు. జమ్మూకాశ్మీర్, నోయిడా, ఉత్తరాఖండ్ లో ఈ భూప్రకంపనలు జరిగినట్లు అధికారులు చెప్పారు. పొరుగుదేశమైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.


Tags:    

Similar News