Delhi : ఆ వాహనాలకు పెట్రోలు పోయొద్దు.. వచ్చే నెల నుంచి నిర్ణయం

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో కాలుష్యాన్ని నివారించేందుకు నూతన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది

Update: 2025-03-01 12:25 GMT

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో కాలుష్యాన్ని నివారించేందుకు నూతన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం కూడా ఆదేశించడంతో కొత్తగా ఏర్పాటయిన బీజేపీ ప్రభుత్వం ఈ మేరకు కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

పదిహేనేళ్లు పైబడిన...
అందులో భాగంగా పదిహేనేళ్లు పైబడిన వాహనాలకు పెట్రోల్ పోయొద్దని పెట్రోల్ బంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో పర్యావరణాన్ని కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యావరణశాఖ మంత్రి సిర్సా మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.


Tags:    

Similar News