ఇండియా కరోనా అప్‌డేట్

భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 7,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

Update: 2023-04-28 04:54 GMT

భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 7,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కేరళలో అత్యధికంగా యాక్టివ్ కేసులున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది.

యాక్టివ్ కేసులు...
ప్రస్తుతం భారత్‌లో 53,852 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పైన తెలిపిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు కూడా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించాలని కోరుతుంది. లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News