భారత్ లో తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు తగ్గాయి. ఈరోజు కొత్తగా 4,184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 104 మంది మరణించారు.

Update: 2022-03-10 04:05 GMT

ఇండియా : భారత్ లో కరోనా కేసులు తగ్గాయి. ఈరోజు కొత్తగా 4,184 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 104 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,24,20,120 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

యాక్టివ్ కేసులు....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 44,488 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,29,80,067 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,15,459మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,79,53,95,649 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు


Tags:    

Similar News