India Corona : భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 13,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 302 మంది మరణించారు

Update: 2022-02-25 04:05 GMT

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 13,166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు 302 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,22,46,884 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

యాక్టివ్ కేసుల సంఖ్య....
యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,34,235 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 4,28,94,345‬ మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,13, 226 మంది మరణించారు. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 1,76,86,89,226 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశారు.


Tags:    

Similar News