కరోనాపై కేంద్రం హైఅలెర్ట్

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

Update: 2022-06-09 07:54 GMT

కరోనా కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు ఎక్కువగా కరోనా పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ మూడు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. కేసులు పెరుగుతుండటంతో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

ఆ మూడు రాష్ట్రాలకు....
టెస్ట్, ట్రాక్, వ్యాక్సినేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మూడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గత రెండు రోజులుగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈరోజు ఐదు వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగానే కరోనా కేసులు రోజూ నమోదవుతున్నాయి. దీంతో ఈ మూడు రాష్ట్రాలను కరోనా కట్టడికి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.


Tags:    

Similar News