జమ్మూ కశ్మీర్ లో విషాదం.. నలుగురు జవాన్లు సజీవదహనం

పిడుగుపాటు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్లోనూ ఇండియన్ ఆర్మీ ట్రక్కు ..

Update: 2023-04-20 13:59 GMT

indian army

జమ్మూకాశ్మీర్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు జవాన్లు సజీవదహనమయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమర జవాన్లకు సంతాపం తెలుపుతున్నారు. జమ్ము-పూంఛ్ రహదారిపై భారత ఆర్మీకి చెందిన ఓ వాహనం వెళ్తోంది.

ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. అయితే.. పిడుగుపాటు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్లోనూ ఇండియన్ ఆర్మీ ట్రక్కు ఇలాంటి ప్రమాదమే జరిగింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఆర్మీ వెహికిల్లో టెక్నికల్ ఫెయిల్యూర్ తలెత్తింది. ఉదయ్పూర్లోని మిలిటరీ స్టేషన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం తలెత్తింది. అంతకు ముందు 2021లో ఆర్మీ వెహికిల్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.


Tags:    

Similar News