పోలీసులకు ప్రాంక్ కాల్ చేస్తున్న మహిళ.. చివరికి

Update: 2022-10-28 06:05 GMT

ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112కి ప్రాంక్ కాల్స్ చేసి పోలీసులను తిట్టినందుకు ఓ మహిళపై కేసు నమోదైంది. నిందితురాలు కాల్స్ చేసి అశ్లీలమైన మాటలు మాట్లాడడమే కాకుండా.. పాటలు కూడా వినిపిస్తూ ఉండేది. కావాలనే పోలీసులకు ఫోన్ చేసి మరీ రెచ్చగొట్టేది. ప్రభుత్వ ఉద్యోగులు విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నందుకు ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించారు. నిందిరాలిని పంచకులలోని బీర్ గగ్గర్ నివాసి సుమన్‌గా గుర్తించారు. టెలికాం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రాజేష్ కాలియా దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, ఒక కాలర్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ 112కి ప్రాంక్ కాల్స్ చేస్తూ తిడుతోందని వెల్లడించారు. అనవసరంగా ఇటువంటి కాల్‌స్ చేస్తూ ఉండడం వలన.. ఆపదలో ఉన్న ప్రజలకు అత్యవసర సేవలు అందుబాటులో లేకుండా పోతాయి. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు విలువైన సమయాన్ని వృధా చేస్తుంటారని పంచకుల డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు పంపిన ఫిర్యాదులో ఎస్పీ పేర్కొన్నారు.

విచారణలో నిందితురాలి ఫోన్ నంబర్‌ను గుర్తించారు. సెక్టార్-5 పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 186 (పబ్లిక్ సర్వెంట్‌ను పబ్లిక్ ఫంక్షన్‌లను నిర్వహించడంలో ఆటంకం కలిగించడం), 290 (పబ్లిక్ న్యూసెన్స్) మరియు 294 (అశ్లీల చట్టం మరియు పాటలు) సహా IPCలోని సంబంధిత సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేయబడింది. హర్యానా 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్‌ను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ జూలై 2021లో రాష్ట్రవ్యాప్తంగా అందిన డిస్ట్రెస్ కాల్‌లకు తక్షణ ప్రతిస్పందన కోసం ప్రారంభించారు. సెక్టార్ 3, పంచకులలోని స్టేట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ నుండి హెల్ప్‌లైన్ నిర్వహిస్తున్నారు. హెల్ప్‌లైన్‌ను దుర్వినియోగం చేయడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలియజేసారు.


Tags:    

Similar News