సోనియా గాంధీకి మోదీ పరామర్శ

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు

Update: 2026-03-31 07:22 GMT

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఇటీవల సోనియా అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సోనియా ఆరోగ్యం పరిస్థితి గురించి తెలుసుకోవడానికి నరేంద్ర మోదీ నేడు ఆసుపత్రికి వెళ్లారు.ఆమెను పరామర్శించారు.

జరుగుతున్న చికిత్సను...
వైద్యులను అడిగి సోనియా గాంధీకి అందుతున్న చికిత్స వివరాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. సోనియా గాంధీ త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ప్రధాని ఆసుపత్రికి వచ్చిన సమయంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు కూడా అక్కడే ఉన్నారు.


Tags:    

Similar News