థియేటర్ ను ధ్వంసం చేసేసిన విజయ్ అభిమానులు

చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్‌ ను హీరో విజయ్ అభిమానులు

Update: 2023-10-06 09:56 GMT

చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్‌ ను హీరో విజయ్ అభిమానులు ధ్వంసం చేశారు. విజయ్ కొత్త చిత్రం 'లియో' ట్రైలర్‌ను ప్రదర్శిస్తున్న సందర్భంగా విజయ్ అభిమానులు థియేటర్ లోని సీట్లను విరగ్గొట్టేశారు. లియో ట్రైలర్ కు చూడడానికి వందలాది మంది విజయ్ అభిమానులు థియేటర్ లోపలికి వచ్చారు. కెపాసిటీ మించి అభిమానులను లోపలికి పంపించారు. ట్రైలర్ స్క్రీనింగ్ తర్వాత థియేటర్ లోపల చూస్తే చాలా వరకూ సీట్లు విరిగిపోయాయి. థియేటర్ యజమానులు ముందుగా పార్కింగ్ ఏరియాలో ట్రైలర్‌ను చూపించాలని అనుకున్నారు. అయితే అవుట్‌డోర్ స్క్రీనింగ్ కు అనుమతి లేకపోవడంతో పోలీసుల సెక్యూరిటీ మధ్య థియేటర్ లోపల స్క్రీనింగ్ నిర్వహించారు. విజయ్ బొమ్మ ఉన్న జెండాలతో థియేటర్ లో అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్ దుస్థితికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'లియో'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్-త్రిష జోడీని చూసి చాలా ఏళ్లు అవుతోంది. ఇక ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ ను కూడా ఈ సినిమాలో ఉన్నారు. విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన 'మాస్టర్' బాక్సాఫీస్ హిట్ గా నిలవగా.. 'లియో' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 19న పాన్ ఈ సినిమా విడుదల కాబోతోంది.


Tags:    

Similar News