నయనతారకు షాక్.. సరోగసీపై కమిటీ ఏర్పాటు చేసిన తమిళ సర్కార్

సోష‌ల్ మీడియా వేదిక‌గా..నయన్- విఘ్నేశ్ లు తల్లిదండ్రులైన విషయంపై జరుగుతున్న రచ్చపై త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి..

Update: 2022-10-13 12:47 GMT

nayanatara surrogacy issue

ప్రముఖ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ లు ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. పెళ్లై నాలుగు నెలలు అయిందో లేదో.. తాము కవల పిల్లలకు తల్లిదండ్రులమయ్యాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులతో నెట్టింట పెద్ద దుమారమే రేగింది. పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులు ఎలా అయ్యాయంటూ నెటిజన్లు, అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు వారిద్దరూ సరోగసీ ద్వారా పేరెంట్స్ అయ్యారన్న వాదన తెరపైకి వచ్చింది.

సోష‌ల్ మీడియా వేదిక‌గా..నయన్- విఘ్నేశ్ లు తల్లిదండ్రులైన విషయంపై జరుగుతున్న రచ్చపై త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ స్పందించారు. ఈ విష‌యంపై న‌య‌న్ దంప‌తులు వివ‌ర‌ణ ఇవ్వాలని తెలిపారు. అలాగే.. సరోగసీ వివాదంపై తమిళ సర్కారు ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. న‌య‌న్ స‌రోగ‌సీపై స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి ప్ర‌భుత్వానికి నివేదిక అందించాల‌ని ఈ క‌మిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు సరోగసీ విధానం ద్వారా పిల్లలను కనడంపై నిషేధాన్ని విధించింది. వారికి గర్భందాల్చే అవకాశం లేని పక్షంలోనే సరోగసీ ఆప్షన్ ను తీసుకోవాలని చట్టం చేసిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News