కంగనా పోస్టులను అడ్డుకోలేం : సుప్రీం సంచలన కామెంట్స్

కంగనా పై పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కంగనా సిక్కులు, ముంబై పోలీసులపై చేసిన

Update: 2022-01-22 08:50 GMT

బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ లేడీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బీ టౌన్ బ్యూటీ సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది. సోషల్ మీడియాలో కంగనా ఎంత యాక్టివ్ గా ఉంటుందో నెటిజన్లకు తెలిసిందే. కేవలం సినిమా అప్డేట్స్ గురించే కాకుండా.. సామాజిక విషయాలపై కూడా తనదైన రీతిలో స్పందిస్తుంటుంది. అప్పుడప్పుడు ఆమె చేసే పోస్టులు వివాదాస్పదం కూడా అవుతుంటాయి. అలా చేసిన ఓ పోస్టే.. కంగనాకు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో కంగనా సోషల్ మీడియా ద్వారా చేస్తున్న వివాదాస్పద పోస్టులను అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. సంచలన కామెంట్స్ చేసింది.

కంగనా పై పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కంగనా సిక్కులు, ముంబై పోలీసులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ముంబైకి చెందిన సర్దార్ చరణ్ జిత్ సింగ్ అనే న్యాయవాది సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. కంగన రనౌత్ సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యల్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఆమె పోస్టులపై కోర్టులను ఆశ్రయించడానికి బదులుగా వాటిని పట్టించుకోవడం మానేయాలని లేదంటే క్రిమినల్ చట్టాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది.



Tags:    

Similar News