సంచలన విషయాలను బయటపెట్టిన నటి పవిత్ర భర్త సుచేంద్ర ప్రసాద్

ఈ వ్యవహారాలపై పవిత్ర లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తమది ప్రేమపెళ్లి అని వెల్లడించారు.

Update: 2022-07-11 08:01 GMT

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, సీనియర్ నటి పవిత్రకు సంబంధించి పలు వార్తలు వైరల్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే. నరేశ్, పవిత్రలపై నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి చెప్పుతో కొట్టేందుకు యత్నించారు.

ఈ వ్యవహారాలపై పవిత్ర లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తమది ప్రేమపెళ్లి అని వెల్లడించారు. అయితే, ఉద్దేశపూర్వకంగానే మ్యారేజి సర్టిఫికెట్ తీసుకోలేదని తెలిపారు. మ్యారేజి సర్టిఫికెట్ విదేశీ విధానం అని, అందుకు తాము వ్యతిరేకం అని వివరించారు. కానీ, ఆధార్ కార్డు, పాస్ పోర్టును పరిశీలిస్తే పవిత్ర తన భార్యే అని స్పష్టమవుతుందని వివరించారు. తామిద్దరం భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు హాజరయ్యామని కూడా సుచేంద్ర చెప్పారు. "నేను హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాను. పవిత్ర లోకేష్ భర్తను నేను.. ఆమె పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు చూస్తే మీకే తెలుస్తుంది. నా పాస్‌పోర్ట్ కూడా ఆమెను నా భార్యగా చూపిస్తుంది. మేమిద్దరం భార్యాభర్తలమవ్వడంతో చాలా మంది మత గురువులు మమ్మల్ని గౌరవించారు. మేం కూడా భార్యాభర్తలుగా కలిసి చాలా కార్యక్రమాలకు వెళ్లాం. ఇంతకు మించిన రుజువు అవసరం లేదు. అయితే వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మాత్రమే తయారు చేయలేదని" అన్నారు. భారతదేశంలో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదని, ఇది విదేశీ సంస్కృతి అని అన్నారు. మన దేశంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానందున తాను మౌనంగా ఉన్నానని, ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేయడం నాకు చాలా తేలికని సుచేంద్ర ప్రసాద్ అన్నారు.
పవిత్రకు ఇటువంటి సంబంధాలు కొత్తేం కాదని అన్నారు. 16 ఏళ్లకే పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లి కూడా అయిన పవిత్ర లోకేష్ మాటలకు సుచేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించలేదు. జరిగినదంతా చూస్తూ మౌనంగా ఉన్నాడు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా పవిత్ర లోకేష్ తన భార్య అని ప్రూఫ్ తో వివరణ ఇచ్చారు. పవిత్ర స్పందిస్తూ, సుచేంద్ర ప్రసాద్ తో తనకు పెళ్లి కాలేదని తెలిపారు.


Tags:    

Similar News