ఓటీటీలో విడుదలైన డీజే టిల్లు

సిద్ధు జొన్నలగడ్డ- నేహాశెట్టి జంటగా వచ్చిన డీజే టిల్లు సినిమాను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా..

Update: 2022-03-04 09:11 GMT

హైదరాబాద్ : కరోనా పుణ్యమా అంటూ.. ప్రేక్షకులకు సినిమా మరింత దగ్గరైంది. థియేటర్లు మూతపడిన సమయంలో.. ఓటీటీ వేదికలుగా చాలా సినిమాలు విడుదలయ్యాయి. థియేటర్లు తెరుచుకున్నాక ఓటీటీల్లో సినిమాలు తగ్గుతాయని భావించారు. కానీ.. థియేటర్లలో కంటే ఓటీటీల్లోనే ప్రేక్షకులు ఎక్కువగా ఉన్నారు. ప్రతివారం ఏదొక కొత్త సినిమా ఓటీటీలో విడుదలవుతూనే ఉంది. అది కూడా.. థియేటర్లో విడుదలైన నెలరోజుల్లోపే కొత్త సినిమాలు ఓటీటీలో వస్తున్నాయి. తాజాగా డీజే టిల్లు సినిమా కూడా ఓటీటీలో విడుదలైంది.

ప్రతి శుక్రవారం కొత్త సినిమాను విడుదల చేస్తోంది ఆహా. అలా ఈ శుక్రవారం సిద్ధు జొన్నలగడ్డ- నేహాశెట్టి జంటగా వచ్చిన డీజే టిల్లు సినిమాను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సిద్ధు ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్లవుతుండగా.. డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. పూర్తి తెలంగాణ స్లాంగ్ లో ఉండే ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రేక్షకాదరణ పొందింది. డీజే టిల్లు సినిమా సక్సెస్ అవ్వడంతో.. దీనికి సీక్వెల్ ను రూపొందించే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు.





Tags:    

Similar News