సినిమాలు చేయని రేణూదేశాయ్‌కి సంపాదన ఎలా వస్తుందో తెలుసా..?

ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న.. రేణూదేశాయ్ కి సంపాదన ఎలా వచ్చేది..? పవన్ వారసులను కూడా..

Update: 2023-10-19 09:54 GMT

పవన్ కళ్యాణ్ తో విడాకులు తరువాత రేణూదేశాయ్.. ఒంటరిగానే బ్రతుకుతుంది. అంతేకాదు వారిద్దరి పిల్లలు భాద్యత కూడా ఆమె తీసుకుంది. అకీరా నందన్, ఆద్య ఆమె దగ్గరే ఉండి చదువుకుంటున్నారు. ఇక 2003లో వచ్చిన 'జానీ' మూవీ తరువాత రేణూదేశాయ్.. సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే 10 ఏళ్ళ తరువాత దర్శకురాలిగా మారి మరాఠిలో ఒక సినిమాని తెరకెక్కించింది. ఆ చిత్రానికి నిర్మాత కూడా రేణూదేశాయ్‌నే.

ఇప్పుడు రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతోంది. అయితే ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న.. రేణూదేశాయ్ కి సంపాదన ఎలా వచ్చేది..? పిల్లల్ని చూసుకోవడమే కాకుండా మధ్యలో ఒక సినిమా నిర్మించే అంత డబ్బు ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందని..? చాలా మందిలో ఒక సందేహం ఉంది. ఇక ఈ విషయం పై తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రేణూదేశాయ్ క్లారిటీ ఇచ్చింది.
ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటుందట. తన కుటుంబసభ్యుల నాయనమ్మ, నాన్న కూడా అదే వృత్తిలో ఉండేవారట. అదే వృత్తి తనకి కూడా అలవాటు అయ్యిందని, ఎప్పటినుంచో హైదరాబాద్, పూణేల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వస్తున్నట్లు చెప్పుకొచ్చింది. టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ వరకు వాటికి కొంచెం బ్రేక్ ఇంచిందట. విడుదల అనంతరం మళ్ళీ ఆ రియల్ ఎస్టేట్ పనుల్లో బిజీ కానుందని చెప్పుకొచ్చింది.
ఇక పవన్ వారసులు గురించి మాట్లాడుతూ.. అకీరాకి ప్రస్తుతం నటన మీద ఇంటరెస్ట్ లేదని, తను హీరోగా అవ్వాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని నేనే చెబుతాను అంటూ తెలియజేసింది. ప్రస్తుతం అమెరికా ఫిలిం స్కూల్ లో మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ పై ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అభిమానులు మాత్రం అకీరా సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక కూతురు ఆద్యా విషయానికి వస్తే.. తను ఆర్కిటెక్ట్ అవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది.


Tags:    

Similar News