కెరీర్ బెస్ట్ రికార్డును సొంతం చేసుకున్న గోపీ చంద్

గోపీచంద్, రాశి ఖన్నా కాంబినేషన్ లో మారుతీ దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం సినిమా హాళ్లలో విడుదలైంది.

Update: 2022-07-02 07:15 GMT

గోపీచంద్, రాశి ఖన్నా కాంబినేషన్ లో మారుతీ దర్శకత్వం వహించిన 'పక్కా కమర్షియల్' చిత్రం సినిమా హాళ్లలో విడుదలైంది. మొదటి రోజు సినిమాను చూడడానికి బాగానే థియేటర్స్ కు చేరుకున్నారు అభిమానులు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తొలి రోజు ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. వసూళ్ల పరంగా కూడా 'పక్కా కమర్షియల్' మొదటి రోజు బాగానే రాబట్టింది. గోపీచంద్ కెరీర్ లోనే తొలి రోజు అత్యధిక మొత్తం రాబట్టిన చిత్రంగా నిలిచింది. 'పక్కా కమర్షియల్' రిలీజ్ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని చిత్ర బృందం ప్రకటించింది. గోపీచంద్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ ఇదే..! గోపీచంద్ గత చిత్రం 'సీటీమార్' మొదటి రోజు దాదాపు 4.1 కోట్లు వసూలు చేసింది. 'పక్కా కమర్షియల్' ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించాడు. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది. సత్య రాజ్‌, సప్తగిరి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రావు రమేష్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కులైన 'డిజిటల్, శాటిలైట్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. మొత్తంగా థియేట్రికల్ బిజినెస్ రూ. 19 కోట్ల రూపాయలు చేసిందని టాక్ నడుస్తూ ఉండగా.. నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగానే ఉంది. మొత్తంగా డిజిటల్, శాటిలైట్ కలిపి ఈ సినిమా రూ. 31 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసింది ఈ సినిమా. ప్రస్తుతానికి నిర్మాతలు సేఫ్ గా ఉన్నా.. థియేటర్ ఓనర్స్ కు ఎలాంటి కలెక్షన్స్ వస్తాయా అనే అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. డిజిటల్ హక్కుల రూపంలో రూ. 16 కోట్లు వస్తే.. శాటిలైల్ రూపేణా రూ. 15 కోట్లు రాబట్టింది. 31 కోట్ల నాన్ థియేట్రికల్ ప్రాఫిట్ నిర్మాతలకు అంందింది. ఈ చిత్రం తాలుకా ఓటీటీ హక్కులను దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో పాటు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా దక్కించుకున్నాయి. ఈ సినిమా విడుదలైన ఐదు వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది.


Tags:    

Similar News