ఓటమిని సహించలేక ఎవరు ఏం చేశారనేది మీ అందరికీ తెలుసు: మోహన్ బాబు

Update: 2022-10-14 02:47 GMT

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ఓటమిని సహించలేక ఎవరు ఏం చేశారు అనేది మీ అందరికీ తెలుసు.. వాళ్లు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజును మోహన్ బాబు స్మరించుకున్నారు. నేను బ్రదర్ అని పిలిచే అత్యంత ఆత్మీయుడు కృష్ణంరాజు మనమధ్య లేకపోవడం చాలా బాధాకరం. విష్ణుని ఎంతో ప్రోత్సహించేవారు. ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. అలాంటి వ్యక్తి లేకపోవడం నిజంగా మనసుకు కష్టంగా ఉందని అన్నారు. ఇక మనం చేసే మంచి అందరికీ చెప్పడంలో తప్పులేదని అన్నారు. చాలా మంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారురో అంటారు. అవసరం.. భారత, భాగవత, రామాయణాల్లో చూసుకుంటే.. హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు సీతాదేవి దగ్గర అమ్మా నేను 100 మంది కోతుల్లో ఒక కోతిని అని చాలా సంవినయంగా చెప్పాడు. రావణాశురిడి దగ్గరకు వెళ్లిన తరవాత కుర్చీనే వేయొద్దని చెప్తే నేనెంతటివాడినో చూపిస్తానని చెప్పి లంకా దహణమే చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సంవినయంగా ఉండాలి.. ఎక్కడ విశ్వరూపం చూపించాలి అన్నది అక్కడే ఉంది. కాబట్టి మనం ఏం చేశామనే విషయాన్ని 10 మందికి తెలియజేయడం అనేది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. చేయనప్పుడు సెల్ఫ్ డబ్బా అని అన్నారు.
"గెలవడం, ఓడడం అనేది సహజం. సినిమా విజయం సాధించడం, అపజయం కావడం సహజం. కానీ, రణ మహర్షి గారు చెప్పినట్టు.. ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో అవన్నీ కలబోసి ఒక మిక్సర్‌లో వేస్తే తయారయ్యేవాడే మనిషి. జనులకు నిలువెల్ల విషమే అన్నాడు. అలా, ఓటమిని సహించలేక ఎవరు ఏం చేశారు అనేది మీ అందరికీ తెలుసు. వాళ్లు కూడా బాగుండాలి" అని కోరుకుంటున్నానని తెలిపారు మంచు మోహన్ బాబు. ఇంతకూ మోహన్ బాబు టార్గెట్ చేసింది ఎవరినా..? అనేది తెలియలేదు.


Tags:    

Similar News