మహేష్ బాబును కలిసిన చిరంజీవి

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి కన్నుమూశారు.

Update: 2022-09-29 09:12 GMT

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి కన్నుమూశారు. వారి కుటుంబాలను పలువురు టాలీవుడ్ ప్రముఖులు పరామర్శిస్తూ వచ్చారు. నిన్న కలవలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి నేడు కృష్ణ, మహేశ్ బాబులను కలిశారు. వారిద్దరినీ పరామర్శించారు. ఈ ఉదయం ఘట్టమనేని వారి ఇంటికి వెళ్లిన చిరంజీవి అక్కడ ఇందిరా దేవి చిత్రపటానికి నివాళులు అర్పించారు. కృష్ణతో మాట్లాడారు.

చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నిర్వహించారు. ఆ ఈవెంట్ కు హాజరవ్వడం కోసం చిరంజీవి వెళ్లారు. ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడే ముందు కూడా ఇందిరా దేవిని తలచుకున్నారు. అంతకు ముందు ట్విట్టర్ లో కూడా ''శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను'' పోస్టు పెట్టారు చిరంజీవి.
సీనియర్ కథానాయకుడు కృష్ణ మొద‌టి భార్య ఇందిరా దేవి. వీరికి ముగ్గురు అమ్మాయిలు.. ప‌ద్మ‌, మంజుల‌, ఇందిరా ప్రియ‌ద‌ర్శిని. ఇద్ద‌రు కొడుకులు ర‌మేష్ బాబు, మ‌హేష్ బాబు. ఈ ఏడాది జనవరిలో ర‌మేష్ బాబు చ‌నిపోయారు. ఇప్పుడు ఇందిరా దేవి కూడా చ‌నిపోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


Tags:    

Similar News