బిల్ గేట్స్ ను కలిసిన మహేష్ బాబు.. ఎందుకు.. ఎలా..?

మహేశ్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు. జులైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో మహేశ్ సరసన నటించనుంది.

Update: 2022-06-29 08:13 GMT

'సర్కారువారి పాట' సినిమా సక్సెస్ అనంతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం హాలిడేస్ లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తన కుటుంబంతో కలిసి మహేశ్ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అమెరికా పర్యటనలో ఉన్న మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి... న్యూయార్క్ సిటీలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మహేశ్ షేర్ చేశాడు. 'బిల్ గేట్స్ ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచంలోని అతి గొప్ప విజనరీల్లో ఆయనొకరు. అంతకంటే ఎక్కువ వినయవంతులు. నిజంగా ఒక స్ఫూర్తి' అని మహేశ్ చెప్పారు. మహేష్ బాబు ఎందుకు కలిశారు అనే డౌట్స్ అభిమానుల్లో ఉన్నాయి. మహేష్ బాబు సమాజ సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బిల్ గేట్స్ కూడా తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు నాంది పలికిన సంగతి తెలిసిందే..! ఇద్దరు మంచి వ్యక్తులు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారంటూ పలువురు అభిమానులు పోస్టులను షేర్ చేస్తూ వస్తున్నారు.

మహేశ్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు. జులైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో మహేశ్ సరసన నటించనుంది.త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేశ్ బాబు కాంబినేషన్ లో ఎస్ఎస్ఎస్ఎంబీ28 (SSMB28) వర్కింగ్ టైటిల్ తో చిత్రం రూపొందుతోంది. ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతుడటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు 'అతడు, ఖలేజా' చిత్రాల్లో నటించాడు. గతేడాది ఆగస్టు 9న ఈ కాంబినేషన్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఇప్పటికీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లలేదు. మహేశ్ బాబు భారత్ కు తిరిగి రాగానే త్రివిక్రమ్ తో కలిసి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.


Tags:    

Similar News