టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసలు

టాలీవుడ్ హీరో నవదీప్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. డ్రగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌కు మరోసారి ఈడీ నోటీసులు..

Update: 2023-10-07 05:08 GMT

టాలీవుడ్ హీరో నవదీప్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. డ్రగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవదీప్‌కు మరోసారి ఈడీ నోటీసులు జారీచేసింది. ఇటీవల మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్ డ్రగ్స్ కన్జ్యూమర్‏గా పేర్కొన్న విషయం తెలిసిందే. గతంలో బయటపడిన డ్రగ్స్‌ కేసు కీలక మలుపులు తిరుగుతూనే ఉంది. దీంతో ఈడీ దూకుడు పెంచింది. డ్రగ్స్‌ కేసులో బాధ్యులను బయటకు రప్పించందుకు విచారణ ముమ్మరం చేస్తోంది. ఈడీ ఈ క్రమంలోనే హీరో నవదీప్‌ను నార్కోటిక్‌ బ్యూరో విచారించింది. డ్రగ్స్ కేసు ఆధారంగా అతడికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన నవదీప్‌ను హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. గత నెల 14న హైదరాబాద్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు మాధాపూర్ పోలీసులతో కలిసి గుడిమల్కాపూర్‏లో నిర్వహించిన ఆపరేషన్ మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో బెంగుళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్స్.. ఓ దర్శకుడితోపాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే వీరి వద్ద నుంచి భారీ ఎత్తున డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరిని విచారించే సమయంలో ఇందులో డ్రగ్స్‌ కొనుగోలు కోసం హీరో నవదీప్ సంప్రదింపులు జరిపినట్లు అతని స్నేహితుడు రాంచందర్ వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నవదీప్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే హీరో నవదీప్ ను పోలీసులు విచారించారు. అతని ఫోన్స్ స్వాధీనం చేసుకుని.. డ్రగ్స్ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారో దానిపై విచారణ జరపుతున్నారు.

Tags:    

Similar News