కృష్ణంరాజు మృతి పై.. ఆర్జీవీ షాకింగ్ ట్వీట్

దర్శకుడు రాంగోపాల్ వర్మ కృష్ణంరాజు మృతి పై స్పందించారు. ఆయన మృతికి సంతాపంగా రెండురోజులు షూటింగ్ ను నిలిపేద్దామని కోరారు

Update: 2022-09-12 05:03 GMT

దర్శకుడు రాంగోపాల్ వర్మ కృష్ణంరాజు మృతి పై స్పందించారు. ఆయన మృతికి సంతాపంగా రెండురోజులు షూటింగ్ ను నిలిపేద్దామని కోరారు. అగ్రనటులందరినీ ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేశారు. "మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం." అని ట్వీట్ చేశారు.

అందరినీ ట్యాగ్ చేస్తూ...
"నేను కృష్ణగారికి,మురళీమోహన్ గారికి, బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు!" అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇది టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News