చిరు ఇంట్లో కమల్, సల్మాన్.. ఎందుకంటే

హైదరాబాదులో ఉన్న కమల్ ను చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించి సన్మానించారు.

Update: 2022-06-12 08:19 GMT

విలక్షణ నటుడు, తన చిరకాల మిత్రుడు కమలహాసన్ ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. 'విక్రమ్' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఉన్న కమల్ ను చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించి సన్మానించారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా అక్కడే ఉన్నారు. కమల్ కు చిరంజీవి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి సన్మానించారు. 'విక్రమ్' దర్శకుడు కనకరాజ్ ను కూడా చిరు అభినందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిరంజీవి తెలిపారు. సినిమా విజయాన్ని అభినందిస్తూ తన ప్రియ మిత్రుడు కమల్ హాసన్ ను సన్మానించడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. కమల్, సల్మాన్ ఖాన్, డైరెక్టర్ కనకరాజ్, 'విక్రమ్' సినిమాకు చెందిన ఇతర టీమ్ సభ్యులకు చిరంజీవి తన నివాసంలో పార్టీ ఇచ్చారు. మరోవైపు 'కభీ ఈద్ కభీ దీవాలీ' సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. నెలరోజుల పాటూ సల్మాన్ ఖాన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారు.

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కాంబినేషన్‌లో ఇటీవల విడుదలైన విక్రమ్ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు KGF: చాప్టర్ 2, వాలిమై తర్వాత 2022లో టాప్-3 వసూళ్లు సాధించిన చిత్రంగా తమిళనాడులో నిలిచింది. విక్రమ్ సినిమా జూన్ 3 న బహుళ భాషలలో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు చేరువలో ఉంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొందించిన 'విక్రమ్' బలమైన కథాంశంతో కూడిన హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్. కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ కాకుండా సూర్య రోలెక్స్ పాత్రలో అతిధి పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, నరైన్, వాసంతి, గాయత్రి, సతన భారతి సహాయక పాత్రల్లో కనిపించారు.


Tags:    

Similar News