యుద్ధంలో చిక్కుకుపోయిన బాలీవుడ్ నటి నుష్రత్..

ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో బాలీవుడ్ యాక్ట్రెస్ నుష్రత్ భరుచ్చా చిక్కుకుపోయింది.

Update: 2023-10-08 05:20 GMT

బాలీవుడ్ యాక్ట్రెస్ నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్‌ లో చిక్కుకుపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మిలిటెంట్ గ్రూప్స్ మధ్య కొనసాగుతున్న దాడులతో సాధారణ ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక అక్కడ చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్, మరికొందరు భారతీయులు.. ఆ యుద్ధంలో చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

కాగా ఆ యుద్ధంలో బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా కూడా చిక్కుకుపోయిన వార్త తాజాగా బయటకి వచ్చింది. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో పాల్గొనేందుకు నుష్రత్ భరుచ్చా ఇజ్రాయెల్ వెళ్లినట్లు.. ఆమె టీం తెలియజేసింది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయం వరకు ఆమె తన టీంతో కాంటాక్ట్ లోనే ఉందట. కానీ ఆ తరువాత నుంచి ఆమెను సంప్రదించలేకపోతున్నారట. చివరిసారిగా మాట్లాడినప్పుడు బేస్‌మెంట్ ఆమె సురక్షితంగా తెలియజేసినట్లు చెప్పుకొచ్చారు.

భద్రతా చర్యల దృష్ట్యా ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలను మేము వెల్లడించలేము. ఆమె నుంచి తిరిగి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాము. నుష్రత్‌ ని సురక్షితంగా భారతదేశానికి తీసుకు రావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ విషయం తెలియడంతో బాలీవుడ్ ఆడియన్స్.. ఆమె సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్ధనలు చేస్తూ వచ్చారు.

అయితే నుష్రత్‌ టీం ఆడియన్స్ కి తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఆమెను ఎట్టకేలకు కాంటాక్ట్ అయ్యారని, భారత రాయబార కార్యాలయం సహాయంతో నుష్రత్‌ సురక్షితంగా ఇండియాకి తిరిగి ప్రయాణం అయ్యింది. ఈరోజు మధ్యాహ్నం నుష్రత్‌ ఇండియాలో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా నుష్రత్‌ ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హిందీ ఛత్రపతి రీమేక్ లో నటించింది. తన కెరీర్ స్టార్టింగ్ లో శివాజీ సరసన 'తాజ్ మహల్' మూవీలో నటించింది.


Tags:    

Similar News