Rashmika Mandanna : పుష్పని మించిపోయిన శ్రీవల్లి..

నార్త్ టు సౌత్ వరుస సక్సెస్ లు అందుకుంటున్న రష్మిక.. ఆ విషయంలో అల్లు అర్జున్ ని మించిపోయింది.

Update: 2023-12-06 10:39 GMT

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం నార్త్ టు సౌత్ క్రేజీ హీరోయిన్ అయిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతి పరిశ్రమలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు. రీసెంట్ గా రణబీర్ కపూర్ 'యానిమల్'లో హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది. పుష్పతో నార్త్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రష్మిక.. యానిమల్ తో ఓ రేంజ్ ఫాలోయింగ్ అందుకుంటున్నారు. దీంతో రష్మిక సోషల్ మీడియా ఫాలోవర్స్ లిస్ట్ పెరుగుతూ వెళ్తుంది.

ప్రస్తుతం రష్మిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 40 మిలియన్స్ పైకి చేరుకుంది. సౌత్ హీరోయిన్స్ లో రష్మిక అత్యధిక ఫాలోవర్స్ తో ఇన్ స్టాగ్రామ్ నెంబర్ వన్ గా నిలిచారు. ఈమె తర్వాతి స్థానంలో సమంత 30 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. సౌత్ హీరోల్లో అల్లు అర్జున్ అత్యధిక ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. శ్రీవల్లి 40 మిలియన్స్ ఫాలోవర్స్ ని సంపాదించుకుంటే.. పుష్ప 23 మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. ఈ విషయంలో శ్రీవల్లి పుష్పని మించిపోయింది అనే చెప్పాలి. బాలీవుడ్ హీరోయిన్స్ కియారా అద్వానీ, జాన్వి కపూర్ కూడా రష్మిక కంటే తక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు.

ఇందువల్లే రష్మిక నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ని తన సొంతం చేసుకున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2లో చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తెలుగులో.. ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో అనే రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు. అలాగే తమిళంలో ధనుష్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఆ చిత్రాన్ని తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి మొదలైంది. అల్లు అరవింద్, దర్శకుడు మారుతి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News