ఎంతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్న నాగార్జున

సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‏లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Update: 2022-06-11 12:15 GMT

కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్ర' సినిమాలో ఆయన ఫస్ట్ లుక్‌ని చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ రివీల్ చేశారు. రణబీర్ కపూర్, అలియా భట్ ముఖ్యపాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున అనీష్ అనే ఆర్టిస్ట్ పాత్రను పోషించారు. "బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ శివ"తో పాన్-ఇండియా సినిమాని రూపొందించాలనే తన కలను నెరవేర్చడంలో నాగార్జున తనకు సహాయం చేశారని అయాన్ ముఖర్జీ అన్నారు. భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని శివ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో అనిష్ విశిష్ట్ పాత్రలో నాగార్జున్ కనిపించనున్నారు. "సహస్ర నందిమ్ సామర్ధ్యం.. హే నంది అస్త్రం.. ఖండ ఖండ ఖురు.. మామ్ సహాయకం, మామ్ సహాయకం" అంటూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్ ఈ నెల 15న విడుదల చేయనున్నారు.

సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న ఈ సినిమాను మూడు పార్ట్‏లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా, ధ్రువ్ సెహగల్, సౌరవ్ గుజార్, దివ్యేందు శర్మ లు నటిస్తూ ఉండగా.. షారూఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నాడనే టాక్ సినిమా అభిమానులను మరింత ఆకర్షిస్తూ ఉంది.


Tags:    

Similar News