"ఆడవాళ్లు మీకు జోహార్లు" ప్రీ రిలీజ్ అతిథులు వీళ్లే

ఈనెల 27వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి "ఆడవాళ్లు మీకు జోహార్లు" ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవ్వనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా

Update: 2022-02-25 07:58 GMT

హైదరాబాద్ : శర్వానంద్ - రష్మిక కాంబినేషన్లో దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కించిన సినిమా "ఆడవాళ్లు మీకు జోహార్లు". సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 4వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇందుకు హైదరాబాద్ లోని శిల్పకళావేదిక.. వేదిక కానుంది.

ఈనెల 27వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి "ఆడవాళ్లు మీకు జోహార్లు" ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవ్వనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేశ్, సాయిపల్లవిలతో పాటు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ విచ్చేయనున్నారు. కీర్తి సురేశ్, సాయిపల్లవిలు ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు సినిమా మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తూ.. ఓ పోస్టర్ ను విడుదల చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న "ఆడవాళ్లు మీకు జోహార్లు" లో రాధిక, ఖుష్బూ, ఊర్వశి వంటి సీనియర్ నటీమణులు ఉన్నారు.






Tags: