Israel -airstrikes- Beirut :బీరూట్పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు
బీరూట్పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు జరిపింది.
The image above shows Israeli strikes on apartment buildings in central Beirut
ఇజ్రాయెల్ సైన్యం ఎలాంటి హెచ్చరిక లేకుండా లెబనాన్ రాజధాని బీరూట్ లోతైన ప్రాంతాలపై తీవ్ర వైమానిక దాడులు చేసింది. ఎప్పటినుంచో యుద్ధ ప్రభావం దూరంగా ఉన్న నగర ప్రాంతాలు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. పలు అపార్ట్మెంట్ భవనాలు కూలిపోయి శిథిలాలుగా మారాయి. దాడుల లక్ష్యం ఏమిటన్నది మొదట స్పష్టంగా తెలియలేదు. తర్వాత ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన చేస్తూ, ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హెజ్బొల్లా తమ ప్రభావం ఉన్న దక్షిణ ఉపనగరాల నుంచి బయటకు వచ్చి నివాస, వ్యాపార ప్రాంతాల్లోకి మారిందని తెలిపింది. అక్కడ వారాలుగా ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశామని పేర్కొంది.
300 మందికి పైగా...
ఈ బాంబుదాడుల్లో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1,800 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో ఎక్కువమంది బీరూట్ నగరం, దాని దక్షిణ ఉపనగరాలవారే. గత ఐదు వారాలుగా సాగుతున్న ఇజ్రాయెల్–హెజ్బొల్లా ఘర్షణలో ఇది అత్యంత ప్రాణనష్టం జరిగిన రోజు అయింది.ఈ దాడులు నగరంలోని రద్దీ వాణిజ్య వీధులు, జనసాంద్రత గల నివాస కాలనీలు, సముద్రతీరంలోని విలాసవంతమైన ప్రాంతాలపై కూడా జరిగాయి. సాధారణంగా యుద్ధ ప్రభావం తక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ఇటీవలి రోజుల్లో ఇజ్రాయెల్ డ్రోన్ల గోల, అప్పుడప్పుడు పేలుళ్ల శబ్దం తప్ప పెద్దగా ప్రభావం లేదు.
భవనం కూలిపోవడంతో...
నగరంలోని ప్రధాన రహదారి కోర్నిష్ అల్-మజ్రా వద్ద ఒక దాడి జరిగింది. ప్రసిద్ధ డ్రైఫ్రూట్స్ దుకాణం పక్కనే ఉన్న అపార్ట్మెంట్ భవనం పూర్తిగా కూలిపోయింది. పార్క్ చేసిన కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. కొన్ని కార్లలో డ్రైవర్లు కూడా ఉన్నట్టు స్థానికులు చెప్పారు.ఇంకో దాడి కొండ ప్రాంతమైన టల్లెట్ ఎల్ ఖయాత్ నివాస కాలనీలో జరిగింది. ఒక విలాసవంతమైన మాల్ పక్కన ఉన్న బహుళ అంతస్తుల భవనం నేలమట్టమైంది. ఈ దాడిలో పురస్కార గ్రహీత అరబిక్ కవయిత్రి, ఆమె భర్త మృతి చెందినట్టు నివాసులు తెలిపారు.సముద్రతీర ప్రాంతమైన అయిన్ ఎల్ తినెహ్ లో మరో అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. అదే భవనంలో అరుదైన మొక్కల దుకాణం కూడా ఉంది. ఇది పార్లమెంట్ స్పీకర్ నివాసానికి సమీపంలో ఉంది. నగరంలోని ఏకైక ప్రజా బీచ్కు అడ్డంగా ఉంది.
అనేక మంది మృతితో...
మరోవైపు మార్ ఎలియాస్ ప్రాంతంలో ప్రసిద్ధ చాక్లెట్ షాపు పక్కనున్న అపార్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. కరాకాస్ జిల్లా లో స్నాక్ షాపు, హెయిర్ సలూన్ ఉన్న భవనం కొంత భాగం కూలిపోయింది. సముద్రతీర రహదారి వెంట ఉన్న భవనాల దిగువ అంతస్తులు ధ్వంసమయ్యాయి. జనసాంద్రత గల బస్తా ప్రాంతంలో ఒక పాఠశాల వద్ద ఆశ్రయం తీసుకున్న ప్రజల సమీపంలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక యువ తల్లి, ఆమె ఇద్దరు కుమారులు మృతి చెందినట్టు తెలిసింది.