నాకు ప్రాణహాని ఉంది : సురేందర్ రెడ్డి
సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి భర్త సురేందర్ పోలీసులను ఆశ్రయించాడు
సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి భర్త సురేందర్ పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల పిల్లలతో కలిసి చర్లపల్లి రైల్వేస్టేషన్లో విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విజయారెడ్డి చనిపోయిన తర్వాత ఆస్తి వివాదాలు మొదలయ్యాయి.
ఆస్తి వివాదాలు కారణమని...
తనకు ప్రాణహాని ఉందని మేడిపల్లి పోలీసులను సురేందర్ ఆశ్రయించారు. సురేందర్ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొంతకాలం క్రితం సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలసి మరణించిన నేపథ్యంలో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.