Hyderaad : రేపు హైదరాబాద్ లో ఈ రూట్లలో వెళ్లొద్దండి... ట్రాఫిక్ ఆంక్షలిక్కడే
వినాయక నిమజ్జనం సందర్భంగా రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు
వినాయక నిమజ్జనం సందర్భంగా రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. బాలాపూర్ వినాయకుడు చార్మినార్, అబిడ్స్, లిబర్టీ, ట్యాంక్బండ్ మీదుగా నెక్లెస్ రోడ్ కు చేరుకుంటారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు ప్యాట్నీ, పారడైజ్, రాణిగంజ్, కర్బలా మైదాన్ నుంచి ట్యాంక్బండ్ కు చేరుకోవాల్సి ఉంటుంది. టోలిచౌకి, మెహిదీపట్నం నుంచి వచ్చే విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ కు చేరుకోవాలి. టప్పాచబుత్ర, ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలకు ఎంజే మార్కెట్లోకి మాత్రమే అనుమతివ్వనున్నారు. ఈ ప్రధాన రూట్ మార్గాల్లో వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా...
సౌత్ ఈస్ట్ జోన్ కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మూసారాంబాగ్, చంచల్ గూడ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు దారి మళ్లించారు. పాట్నీ, పారడైజ్, రాణిగంజ్ ప్రాంతాలలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్ట మైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. రద్దీ సమయంలో మెహిదీపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్సుఖ్ నగర్ , నారాయణగూడ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇవ్వనున్నారు. విమానాశ్రయానికి వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లేవారు బేగంపేట, పారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలని పోలీసుల సూచించారు.