ఫ్యాక్ట్ చెక్: LPG గ్యాస్ సమస్య గురించి ప్రజలు ప్రశ్నిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీని కాదు. ఆయనలా కనిపించే వ్యక్తిని

ప్రధాని నరేంద్ర మోదీని రోడ్ షోలో గ్యాస్ సమస్య గురించి ప్రజలు ప్రశ్నించారు

Update: 2026-04-13 04:28 GMT

భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ఎల్పీజీ సిలిండర్ల ధరల నుండి ఎలక్ట్రిక్, హైడ్రోజన్ స్టవ్‌ల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. భారతదేశంలో వంట చేసే విధానం నెమ్మదిగా మారుతోంది. దశాబ్దాలుగా, ఎల్పీజీ భారతీయ వంటగదులకు వెన్నెముకగా నిలిచింది. సులభంగా అందుబాటులో ఉండడమే కాకుండా ఉపయోగించడానికి సులభమైనది. ఇప్పుడు నగరాల్లో విద్యుత్, కొత్త ఇంధన సాంకేతికతలు వచ్చేశాయి. చాలా కుటుంబాలు తమ ఎంపికలను పునరాలోచించడం ప్రారంభిస్తున్నాయి.


లక్షలాది భారతీయ కుటుంబాలకు ఎల్.పి.జి (ద్రవీకృత పెట్రోలియం గ్యాస్) ప్రధాన వంట ఇంధనంగా కొనసాగుతోంది. విస్తృతంగా లభిస్తుంది. విద్యుత్ కోతలు ఉన్న ప్రాంతాలలో ఎల్.పి.జి. ని నమ్ముకోవడం అత్యుత్తమం. సంవత్సరాలుగా దీని ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. చాలా నగరాల్లో, ఒక గృహ వినియోగ ఎల్.పి.జి సిలిండర్ ధర 900 నుండి 1,100 రూపాయల మధ్య ఉంటుంది. ఒక చిన్న, మధ్య తరహా కుటుంబానికి, ఒక సిలిండర్ సాధారణంగా 25 నుండి 30 రోజుల వరకు వస్తుంది.

అయితే ప్రధాని నరేంద్ర మోదీని గ్యాస్ విషయంలో ప్రజలు ప్రశ్నించారంటూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడిందని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయగా, దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ప్రధానమంత్రి ఒక రోడ్‌షోలో పాల్గొంటుండగా, సామాన్య ప్రజలలో ఒకరు తమకు గ్యాస్ అందడం లేదని ఆయనకు ఫిర్యాదు చేయడం వినవచ్చు. దానికి ప్రధానమంత్రి, 'నేను తెప్పిస్తాను' అని అన్నట్లుగా ఉంది.

వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు

https://archive.ph/kAoXZ

వైరల్ స్క్రీన్ షాట్ ఇక్కడ ఉన్నాయి



 



ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది ప్రధాని నరేంద్ర మోదీ కాదు.

గూగుల్ లెన్స్ ను ఉపయోగించి గూగుల్ సెర్చ్ చేయగా, 2026 మార్చి 30న ‘khabronkiduniya_24’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రచురించిన ఒక వీడియో మా దృష్టికి తెచ్చాయి. వైరల్ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పోలిన వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు ఇందులో ఉన్నాయి. రెండు వీడియోలలోని నేపథ్యం కూడా ఒకేలా ఉంది. ఆ పోస్ట్‌తో పాటు పంచుకున్న వివరాలను సమీక్షించగా, ఆ వీడియోలో ఉన్నది ప్రధాని మోదీ కాదని తెలుసుకున్నాం.

ఒడిశాలోని రూర్కెలాలో రామ నవమి సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో మోదీని పోలిన వ్యక్తి అని ఆ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు స్పష్టంగా పేర్కొన్నారు.



ఇక స్థానిక మీడియా సంస్థలు కూడా ఈ ఈవెంట్ ను కవర్ చేశాయి.

Full View


Full View


ప్రధాని మోదీ ఇటీవల రూర్కెలాను సందర్శించారని ఏవైనా విశ్వసనీయ వార్తా నివేదికల కోసం వెతికాం. అయితే, మా పరిశోధనలో అలాంటి నివేదికలు ఏవీ లభించలేదు. ఒకవేళ అలాంటి పర్యటన జరిగి ఉంటే, ఆ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచురితమై ఉండేది. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది ప్రధాని మోదీ కాదని, ఆయన పోలికలతో ఉన్న వ్యక్తి అని మరింతగా నిర్ధారించింది.

వైరల్ వీడియోలో ఉన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాదని, ఆయన పోలిక ఉన్న వ్యక్తి అని స్పష్టంగా తెలుస్తోంది. గ్యాస్ కొరతపై వచ్చిన ఫిర్యాదుకు ఆయన స్పందించారన్న వాదన అబద్ధం.


Claim :  ప్రధాని నరేంద్ర మోదీని రోడ్ షోలో గ్యాస్ సమస్య గురించి ప్రజలు ప్రశ్నించారు
Claimed By :  social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News