భర్తతో సన్నిహితంగా ఉంటోందని.. యువతిపై లైంగిక దాడి చేయించిన భార్య

గాయత్రి తనకు ఆరోగ్యం బాలేదంటూ.. బాధితురాలిని తన ఇంటికి పిలిచింది. ఫిబ్రవరి వరకూ తన ఇంట్లోనే ఉంచుకుంది. ఈ క్రమంలో..

Update: 2022-05-29 13:27 GMT

కొండాపూర్ : తన భర్తతో ఓ యువతి సన్నిహితంగా ఉంటుందని.. అతని భార్య నలుగురు యువకులతో యువతిపై లైంగిక దాడి చేయించిన దారుణ ఘటన కొండాపూర్ లో జరిగింది. గాయత్రి, శ్రీకాంత్ దంపతులు. శ్రీకాంత్ కుటుంబం, బాధితురాలి కుటుంబం కొండాపూర్ లోని ఒకే కాలనీలో ఉంటున్నారు. ఇద్దరూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.

గాయత్రి తనకు ఆరోగ్యం బాలేదంటూ.. బాధితురాలిని తన ఇంటికి పిలిచింది. ఫిబ్రవరి వరకూ తన ఇంట్లోనే ఉంచుకుంది. ఈ క్రమంలో భర్త శ్రీకాంత్, యువతి ప్రవర్తనలో గాయత్రికి అనుమానం వచ్చింది. ఏప్రిల్ 24న ఈ వ్యవహారం పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇటీవల కేసు విత్ డ్రా చేసుకుని, మాట్లాడాలంటూ బాధితురాలి కుటుంబాన్ని ఇంటికి పిలిచింది. పదకం ప్రకారం యువతిని గదిలోకి తీసుకెళ్లి.. కిరాయికి మాట్లాడుకున్న నలుగురు యువకులతో దాడి చేయించింది. బాధిత యువతి నోటికి ఆ నలుగురు ప్లాస్టర్ వేసి, తీవ్రంగా హింసించారు.
ఆపై యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా గాయత్రి వీడియో తీసింది. తన భర్త జోలికొస్తే.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. గాయాలపాలైన ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, జరిగిన ఘాతుకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని, ఆమెకు సహకరించిన నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News