దళిత యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో

ఆ యువతి గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం..

Update: 2023-02-09 12:06 GMT

srikakulam crime

తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తోన్న దళిత యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతి గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన యువతి తల్లిదండ్రులు కొద్దినెలల క్రితం మరణించారు. చేరదీసే వారెవరూ లేక.. మందస మండలంలో యాచిస్తూ జీవనం సాగిస్తోంది. రాత్రిపూట స్థానిక ఎంపీడీఓ కార్యాలయ వరండాలో నిద్రిస్తోంది.

ఈ క్రమంలో యువతిపై జిల్లుండకు చెందిన గ్రామ వాలంటీరు కణితి బాలకృష్ణ కన్నేశాడు. మాయమాటలతో ఆమెను లొంగదీసుకుని, అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బాలకృష్ణపై కేసు నమోదు చేశామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు.


Tags:    

Similar News