ట్రాన్స్ జెండర్ ను వేధించిన ఆ నలుగురి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు లోకి తెచ్చారు. విశాఖపట్నంలో ట్రాన్స్జెండర్ మహిళపై

Update: 2023-06-20 18:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు లోకి తెచ్చారు. విశాఖపట్నంలో ట్రాన్స్జెండర్ మహిళపై వేధింపులకు పాల్పడినందుకు గాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ట్రాన్సజెండర్ పర్సన్ (హక్కుల పరిరక్షణ) చట్టం 2019 కింద కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆసుపల్లి శ్రీనివాసులు (33), హనీష్ కుమార్ (26), సతీష్ కుమార్ (30), మనోజ్ కుమార్ (23) ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 8న, 26 ఏళ్ల ట్రాన్స్ మహిళ, స్థానిక థియేటర్‌లో సినిమా చూసి జగదాంబ జంక్షన్ నుండి హనుమంతవాకకు ఆటోరిక్షా ఎక్కింది. అందులో అప్పటికే ముగ్గురు పురుషులు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆమె ప్రైవేట్ భాగాలను తాకడం మొదలుపెట్టారు. ఆమె అరుస్తూ చివరికి పెదగదిలి జంక్షన్ వద్ద ఆటోరిక్షా నుండి దిగేసింది. ఆమె ఆటో దిగిన తర్వాత, ఆటో డ్రైవర్‌తో సహా నలుగురు వ్యక్తులు ఆమెను కొట్టడం ప్రారంభించారు. ఆమె తలపై కూడా గాయాలయ్యాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు చేయడంతో ట్రాన్స్‌జెండర్ చట్టం కింద కేసు నమోదు చేశామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. పోలీసులు ట్రాన్స్ జెండర్ చట్టం కింద మాత్రమే కాకుండా పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది మొదటి కేసు (లింగమార్పిడి రక్షణ చట్టం కింద)" నమోదైన కేసు అని ACP వివేకానంద అన్నారు. అయితే చట్టం దుర్వినియోగం అవ్వకుండా.. ట్రాన్స్‌జెండర్లు దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దని కోరారు.


Tags:    

Similar News