యూపీ లో దారుణం.. 17 మంది విద్యార్థినులపై ప్రిన్సిపల్ అరాచకం.

యూపీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్.. కామావతారం ఎత్తాడు.

Update: 2021-12-07 12:09 GMT

యూపీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రిన్సిపల్.. కామావతారం ఎత్తాడు. తన కామవాంఛ తీర్చుకుని, ఎవరికైనా చెప్తే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ విద్యార్థినులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా బెదిరించాడు. వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 17 మంది విద్యార్థినులపై స్కూల్ ప్రిన్సిపల్ యోగేష్ కుమార్ తో పాటు, అతని సహచరుడు సైతం వేధింపులకు పాల్పడినట్లు స్థానిక పీఎస్ లో కేసు నమోదైంది. ప్రాక్టికల్స్ ఉన్నాయి.. స్కూల్ కి రమ్మని పిలిచి, ఆ రాత్రికి అక్కడే ఉండాలని సూచించాడు. ప్రిన్సిపల్ మాట కాదనలేక అక్కడే ఉండిపోయిన బాలికలకు మత్తుమందు కలిపిన ఆహారం పెట్టి.. స్పృహ కోల్పోయాక.. బాలికలపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఆపై ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే పరీక్షల్లో ఫెయిల్ చేయడంతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో తెలిపారు.

పథకం ప్రకారం....
ఆ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు మొత్తం 29 మంది ఉండగా.. ప్లాన్ ప్రకారం కేవలం 17 మంది విద్యార్థినులనే ప్రాక్టికల్స్ పేరిట స్కూల్ కి రప్పించాడు. ఈ ఘటన నవంబర్ 18వ తేదీన జరుగగా.. ఫిర్యాదు స్వీకరించి, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో ఆలస్యంగా బయటపడింది. స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ ఉత్వల్ జోక్యంతోనే పోలీసులు ఫిర్యాదును స్వీకరించినట్లు విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోయారు. ఆ తర్వాత విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేసినట్లు ముజఫర్‌నగర్‌ ఎస్పీ అభిషేక్‌ యాదవ్‌ తెలిపారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి విచారణ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.



Tags:    

Similar News