దొంగిలించారని.. గుండు కొట్టించి?

శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులకు గుండుకొట్టించారని స్థానికులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2021-12-21 03:53 GMT

శంషాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులకు గుండుకొట్టించారని స్థానికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాటరీలను దొంగతనం చేస్తున్నారన్న ఆరోపణలపై ఖుద్దూస్, ఖాజా అనే యువకులను స్థంభానికి కట్టేసి గుండు కొట్టించారు. ఈ సంఘటన పై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో బ్యాటరీలు చోరీకి గురవుతున్నాయి.

పోలీసులకు ఫిర్యాదు....
దీనిని గమనించిన స్థానిక యువకులు కొందరు ఖాజా ఇంట్లో తనిఖీ చేయగా కొన్ని బ్యాటరీలు లభ్యమయ్యాయి. బ్యాటరీలు దొంగిలించింది వీరేనని భావించి ఖాజా, ఖుద్దూస్ లను స్థంభానికి కట్టేసి గుండు కొట్టించారు. ఈ ఘటనపై ఆ యువకులిద్దరూ ఎయర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News