Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురి మృతి

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

Update: 2023-12-18 01:56 GMT

 uttar pradesh road accident

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరణించిన నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. యూపీలోని ఒరాయ్ లోని బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేలో కైథారి టోల్‌ప్లాజా సమీపంలో నిన్న అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. డంపర్ లోడర్ ను ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. వీరంతా దాకోర్ లోని మోహనా గ్రామనికి చెందిన వారుగా గుర్తించారు. రాత్రి పన్నెండు గంటల సమయంలో టోల్ ప్లాజా వద్ద లోడర్ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన డంపర్ వేగంగా ఢీకొట్టింది.

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేలో...
దీంతో లోడర్ బోల్తా పడింది. లోడర్ లో ఉన్న వారిలో నలుగురు మరణించారు. వెంటనే పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరణించిన నలుగురిలో మహిళ కూడా ఉంది. లోడర్ లో మొత్తం పన్నెండు మంది ఉండగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. పోలీసులు ప్రమాదానికి అతి వేగమే కారణమని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News