బెడ్‌పై పడుకుని రివాల్వర్‌తో సెల్ఫీలు.. అకస్మాత్తుగా ట్రిగ్గర్‌ ను నొక్కడంతో

బెడ్‌పై పడుకుని రివాల్వర్‌తో సెల్ఫీలు..

Update: 2022-07-17 11:35 GMT

ప్రస్తుతం సెల్ఫీల మోజు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. నేటి కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవాళ్లు.. సెల్ఫీలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. అదే సమయంలో చాలా సార్లు సెల్ఫీలు దిగుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకుంటూ ఓ టీనేజర్ ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు గదిలో బెడ్‌పై పడుకుని లైసెన్స్ రివాల్వర్‌తో సెల్ఫీ తీసుకుంటున్నాడని, ఆ సమయంలో అకస్మాత్తుగా ట్రిగ్గర్‌ నొక్కడంతో.. బుల్లెట్ అతడిని తాకడంతో అక్కడికక్కడే మరణించాడు.

ఫతేపూర్ చౌరాసి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజీపూర్ బంగర్ గ్రామంలో నివసించే వాటర్ ప్లాంట్ యజమాని ఇంద్రేష్ కుమారుడు సుచిత్ ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం గదిలోని మంచంపై పడుకుని ఉన్న సమయంలో ఇంట్లో ఉంచిన లైసెన్స్ రివాల్వర్ తో సెల్ఫీ దిగాలని భావించాడు. డ్రాలో ఉంచిన రివాల్వర్ తీసుకొచ్చి మంచంపై పడుకుని రివాల్వర్ తో సెల్ఫీలు దిగాడు. ఈ సమయంలో అకస్మాత్తుగా ట్రిగ్గర్ నొక్కినప్పుడు బుల్లెట్ అతడికి తగిలింది. అతని కేక విని సుచిత్ తల్లి, తండ్రి ఇంద్రేష్ బెడ్ రూమ్ వైపు పరిగెత్తారు. రక్తంలో తడిసిన సుచిత్‌ను చూసి చికిత్స కోసం కాన్పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. మార్గమధ్యంలో, అతను చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. మొత్తం వ్యవహారంపై విచారణ నిర్వహిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News