అమెరికాలో తెలుగు యువకుడి మృతి

అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరుకు చెందిన ఒక యువకుడు మృతి చెందాడు

Update: 2023-04-21 04:16 GMT

అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరుకు చెందిన ఒక యువకుడు మృతి చెందాడు. అమెరికాలోని ఒహాయోలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు ఏలూరు పట్టణంలోని అశోక్ నగర్ కు చెందిన వీరా సాయేశ్‌గా గుర్తించారు. సాయేశ్ వయసు 25 ఏళ్లు.

పెట్రోలు బంకులో...
2021లో సాయేశ్ ఎంఎస్ చేయడం కోసం అమెరికా వెళ్లాడు. తండ్రి కొన్నేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లి, అన్నయ్య ప్రోత్సాహంతో అమెరికా వెళ్లిన సాయేశ్ ఒక పెట్రోలు బంకులో పార్ట్‌టైం పనిచేస్తున్నారు. అయితే పెట్రోలు బంకులో ఉండగా దుండగులు వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాయేశ్ అక్కడికక్కడే మరణించారు. దీంతో సాయేశ్ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని భారత్ కు తీసుకు వచ్చేలా ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Tags:    

Similar News