హైదరాబాద్ లో మైనర్ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారం.. బ్లాక్ మెయిల్

సికింద్రాబాద్ చిలకలగూడలో మైనర్‌ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో

Update: 2022-06-09 06:08 GMT

సికింద్రాబాద్‌లో మైనర్‌ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. నిందితులను అంబర్‌పేట్‌ కు చెందిన నవాజ్‌, ఇంతియాజ్‌ లుగా గుర్తించారు. ప్రేమ పేరుతో మోసం చేసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు బాలికల తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం చేసుకొని ప్రేమ పేరుతో అత్యాచారం చేసినట్లు బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా ప్రేమ పేరుతో అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం.

ప్రేమ పేరుతో నవాజ్‌, ఇంతియాజ్‌ లు మైనర్ అక్కా(17) చెల్లెళ్లను(15) మోసం చేశారు. ఈ ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ చిలకలగూడలో మైనర్‌ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట్‌కు చెందిన ఇంతియాజ్‌(21), నవాజ్‌(21) యువకులు ఇద్దరు అక్కాచెల్లెళ్లని ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నారు. మొదట స్నేహితులుగా ఉన్న వారు క్రమంగా ఆ యువకుల ప్రేమలో పడ్డారు. వాళ్ల మధ్య సాన్నిత్యం పెరిగి ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆ యువకులతో శారీరకంగా కలిశారు. మైనర్ బాలికల తండ్రికి ఈ విషయం తెలిసి యువకులను పలుమార్లు హెచ్చరించారు. తమ కుమార్తెల జోలికి రావొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. వారు వినకపోవడంతో బాధిత తండ్రి తమను ఆశ్రయించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్లయిన తమ కుమార్తెలపై రెండేళ్లుగా నవాజ్‌, ఇంతియాజ్‌లు అత్యాచారం చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.


Tags:    

Similar News