బర్త్ డే పార్టీకి మైనర్ బాలికను పిలిచి..!

బర్త్ డే పార్టీలో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి నీతో మాట్లాడాలని ఉందని ఆమెను గది లోకి ఆహ్వానించాడు.

Update: 2022-07-08 11:53 GMT

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఓ పాఠశాల విద్యార్థినిపై ఆమె తోటి సహచర విద్యార్థులు ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేశారు. బాధితురాలైన 15 ఏళ్ల బాలిక.. కో-ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. అదే పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు వేడుకకు ఆమెను ఆహ్వానించబడింది. బర్త్ డే పార్టీలో 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి నీతో మాట్లాడాలని ఉందని ఆమెను గది లోకి ఆహ్వానించాడు.

విద్యార్థి అకస్మాత్తుగా డోర్ లాక్ చేసి.. తన మిగిలిన ఇద్దరు స్నేహితులను లోపలికి ఆహ్వానించాడని బాలిక ఆరోపించింది. ముగ్గురు విద్యార్థులు 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ ఘటనను వీడియో చిత్రీకరించారని బాలిక చెబుతోంది. ఈ వీడియో అదే పాఠశాలకు చెందిన ఇతర విద్యార్థులకు కూడా పంపించబడింది. బాలిక పాఠశాలకు వెళ్లకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎందుకు వెళ్లడం లేదని బాధితురాలి తల్లి ప్రశ్నించగా, బాలిక తనకు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులతో చెప్పింది. వెంటనే తల్లి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రీజనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా బాలికను విచారించి కేసు నమోదు చేశారు. అనంతరం ముగ్గురు విద్యార్థులను పోక్సో చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News