1280 కోట్ల రూపాయల మోసంలో భారత ఫార్మా దిగ్గజం అరెస్ట్

149 మిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణ మోసంలో పాల్గొన్నందుకు అమెరికాకు చెందిన

Update: 2025-06-05 07:35 GMT

149 మిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణ మోసంలో పాల్గొన్నందుకు అమెరికాకు చెందిన, భారత సంతతికి చెందిన ఫార్మా దిగ్గజాన్ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. 61 ఏళ్ల తన్మోయ్ శర్మ, సావరిన్ హెల్త్ గ్రూప్ వ్యవస్థాపకులు, మాజీ CEO. ఆయన అస్సాంలోని గౌహతికి చెందినవారు.


దిబ్రూఘర్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో ఇంటర్న్ అయిన శర్మ, ఆరోగ్య బీమా సంస్థలకు 149 మిలియన్ డాలర్లకు పైగా మోసపూరిత క్లెయిమ్‌లను సమర్పించాడని ఆరోపణల మీద అరెస్టు అయ్యాడు. సావరిన్ హెల్త్ గ్రూప్ మోసపూరిత వ్యూహాలను ఉపయోగించి రోగులను వారికి తెలియకుండానే బీమా పథకాలలో మోసపూరితంగా చేర్చుకుందని కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లోని US అటార్నీ ఆరోపించింది.

Tags:    

Similar News