కోడి కూరపెట్టింది.. కోట్లు కొట్టేసింది

కోడి కూర పెట్టి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన తమిళనాడులో జరిగింది. వర్షిణి అనే యువతి తన స్నేహితులను ఇంటికి పిలిపించింది.

Update: 2023-05-05 07:07 GMT

కోడి కూర పెట్టి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన తమిళనాడులో జరిగింది. వర్షిణి అనే యువతి తన స్నేహితులను ఇంటికి పిలిపించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రాజేశ్వరితో వర్షిణితో పరిచయం పెంచుకుంది. వేల ఎకరాలు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

స్పృహతప్పి పడిపోవడంతో...
దీంతో వర్షిణి ఆహ్వానం మేరకు స్నేహితులందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వారందరికీ కోడికూర వడ్డించింది. అది తిని అందరూ స్పృహతప్పి పడిపోయారు. దీంతో వర్షిణి బంగారు ఆభరణాలు, నగదుతో పరారయింది. వర్షిణి విదేశాలకు వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఆమె కోసం గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు.


Tags:    

Similar News