Drugs : 230 కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. బడా స్మగ్లర్ల అరెస్ట్

గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 230 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది.

Update: 2024-04-28 07:44 GMT

గుజరాత్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 230 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్కాడ్ తో కలసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ డ్రగ్స్ ర్యాకెట్ కు చెక్ పెట్టింది. గుజరాత్, రాజస్థాన్ లో కలసి చేసిన ఆపరేషన్ లో పెద్దయెత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు దాడులు చేసి డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

పదమూడు మందిని...
ఈ కేసులో మొత్తం పదమూడు మందిని అరెస్ట్ చేశారు. ఏకకాలంలో దాడులు చేయడంతో అటు నిందితులతో పాటు ఇటు పెద్దమొత్తంలో డ్రగ్స్ స్వాధీనం అయ్యాయి. అహ్మాదాబాద్ కు చెందిన మనోహర్ లాల్ ఎనాని, రాజస్థాన్ కు చెందిన కుల్దీప్ సింగ్ లు ఈ డ్రగ్స్ ర్యాకెట్ ను నడుపుతున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Tags:    

Similar News