శ్రీనగర్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆందోళనలో స్థానికులు

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాజ్ బాగ్ లోని వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు..

Update: 2022-01-27 14:09 GMT

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాజ్ బాగ్ లోని వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భవనంలో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా ప్రమాద స్థలానికి చేరుకుని ఫైరింజన్ సాయంతో మంటలను అదుపుచేశారు.

కాగా.. భవనంలోని సిలిండర్ పేలడం వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ కమర్షియల్ భవనంలో అనేక కంపెనీల ఆఫీసులున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News