కూతురికి నాలుగేళ్లుగా నరకం చూపిస్తున్న తండ్రి

చివరికి తన వల్ల కాక ఓ స్వచ్చంధ సంస్థను ఆశ్రయించి.. తన గోడు వెళ్లబోసుకుంది. సొంత మనుషులు, పరాయి మనుషులన్న..

Update: 2023-07-02 07:49 GMT

కూతురికి కొండంత అండంగా ఉండాల్సిన తండ్రే.. ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఎవరికి చెప్పుకోవాలో.. ఏమని చెప్పుకోవాలో.. చెబితే నమ్ముతారో లేదోనన్న భయంతో తండ్రి ఎంత హింసించినా భరించింది ఆ బాలిక. చివరికి తన వల్ల కాక ఓ స్వచ్చంధ సంస్థను ఆశ్రయించి.. తన గోడు వెళ్లబోసుకుంది. సొంత మనుషులు, పరాయి మనుషులన్న తేడా లేదు. ఆడపిల్లలకు బయటే కాదు.. సొంతింట్లోనూ రక్షణ లేకుండా పోతోంది. తాత, తండ్రి, బాబాయ్, అన్న, మామయ్య ఇలా.. ఎవరొ ఒకరు ఆడపిల్లల్ని వేధిస్తున్నారు. నాలుగేళ్లుగా ఓ తండ్రి కూతురిని వేధిస్తున్న ఘటన శ్రీ సత్య సాయి జిల్లా, మడకశిర నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

నాలుగేళ్లుగా కన్న కూతురిని శారీరకంగా హింసిస్తున్నాడు ఆ సైకో తండ్రి. తండ్రి పెట్టే బాధలు భరించలేక.. శనివారం (జులై 1) రాత్రి ఓ స్వచ్చంధ సంస్థను ఆశ్రయించి.. జరిగింది వివరించింది. ఆ స్వచ్ఛంధ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News